వందేళ్ల రికార్డు!
చత్తీస్ గఢ్: గత నెల్లో ఓ రాష్ట్రంలో కురిసిన వర్షం సరికొత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా వందేళ్ల తరువాత కావటంతో ఆ వర్షం అరుదైన ఘనతను సొంత చేసుకుంది. మార్చినెలలో హర్యానా రాష్ట్రంలో వర్షపాతం సగటు 77 ఎంఎంగా నమోదయ్యింది. ఇదే గడిచిన వందేళ్లలో అత్యధిక వర్షపాతమని హర్యానా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీఎస్ దేశీ తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో వర్షపాతం సగటు 11 ఎంఎంగా ఉంటుందని..అయితే మార్చి నెలలో అకాల వర్షం కురిసి అత్యధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు.
దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల తీవ్ర నష్టం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్నికేంద్రం దృష్టికి తీసుకువెళ్లి నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. ఇలా అత్యధిక వర్షపాతం నమోదు కావడం నిజంగానే వందేళ్లకు సరిపడా వర్షం కురిసినట్లు ఉంది కదూ!