‘పార్టీ అడిగితేనే రాజీనామా చేస్తా’
ఇడుక్కి(కేరళ): తన పార్టీ అడిగితే రాజీనామా చేసేందుకు తాను సిద్థంగా ఉన్నానని కేరళలో మహిళా ఉద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి సీపీఎం సీనియర్ నేత ఎంఎం మణి అన్నారు. ‘నా పార్టీ అడిగితే మాత్రమే నేను రాజీనామా చేస్తాను’ అని కుంచితన్నిలో మీడియా ప్రతినిధులతో అన్నారు. మొక్కల పెంపకానికి సంబంధించిన ఉద్యోగుల కార్యకర్తలను ఉద్దేశించి, వారి వ్యక్తిత్వాన్ని గురించి ఎంఎం మణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వారిని అవమానించేలా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా మహిళా సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, మహిళ సంఘాలు మణి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిపై ఇప్పటికే స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరోక్షంగా మంత్రి వ్యాఖ్యలు తప్పుబట్టారు. ‘మహిళలకు వ్యతిరేకంగా ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా అది సరైనది కాదు’ అని చెప్పారు. అయితే, మంత్రి స్పందిస్తూ మీడియానే తన మాటలను వక్రీకరించిందని చెప్పారు. ఆయన కార్యాలయం ముందు ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నా వారిని అలాగే చేసుకోనివ్వండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.