టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు

టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు - Sakshi


భువనేశ్వర్: టీ ఇవ్వటంలో ఆలస్యం చేసిందని భార్యను హతమార్చాడో కిరాతక భర్త. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. భువనేశ్వర్కు 110 కిలోమీటర్ల దూరంలోని దెన్కనల్ జిల్లా గుహలిపుల్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... మహలి నాయక్ (56) సోమవారం ఉదయం భార్య ఝనాను టీ కావాలని అడిగాడు.



అయితే టీ చేసి ఇవ్వటంలో జాప్యం కావటంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో అతడు భార్యతో వాగ్వివాదానికి దిగాడు. అతి కాస్తా తీవ్రతరం కావటంతో ఆమె భర్తకు వంట చేసి, వడ్డించేందుకు నిరాకరించింది. ఇదే విషయంపై బుధవారం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగటంతో కోపోద్రిక్తుడైన మహలి నాయక్ బుధవారం రాత్రి పదునైన ఆయుధంతో భార్య హతమార్చాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top