'డీఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు'


న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన డి.శ్రీనివాస్కు ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో డీఎస్ పార్టీ మారిన అంశాలపై వివరించారు. బంగారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను వదిలి వెళ్లిన డీఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారని రవి అన్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మంచి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోందని రవి ఈ సందర్భంగా ఆయన వారితో చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top