యూపీలో దూసుకెళుతున్న సమాజ్వాదీ
లక్నో : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ దూసుకెళుతోంది. అక్కడ జరిగిన 11 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ ఆధిక్యం కనపరుస్తోంది. ఏడు స్థానాల్లో సైకిల్ జోరు కొనసాగుతోంది. బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో ఎస్పీ హవాతో... అసెంబ్లీ స్థానాల్లో కమలానికి ఎదురు దెబ్బ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్లోని 11 శాసనసభా స్థానాల్లో ఫలితాలు బీజేపీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక మెయిన్పురి లోక్సభ స్థానంలో కూడా ఎస్పీ ముందంజలో ఉంది. ఇప్పటివరకూ జరిగిన ఓట్ల లెక్కింపులో ఎస్పీ-7, బీజేపీ-3, కాంగ్రెస్-1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.