72 గంటల తర్వాత శిథిలాల నుంచి బయటపడ్డ చిన్నారి
పుణె: మహారాష్ట్రలోని పుణే జిల్లా మాలిన్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఓ ఆరు నెలల చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆ చిన్నారిని దాదాపు 72 గంటలు తర్వాత సురక్షితంగా వెలికితీశారు.
ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా శిథిలాల కింద 100 మందికిపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణం జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందాలకు అడ్డంకిగా మారాయి. భారీ వర్షాలు, పేరుకుపోయిన మట్టి, పెద్దపెద్ద బండ రాళ్ల కారణంగా శిథిలాల కింద ఉన్న వారు ప్రాణాలతో ఉండేది అనుమానంగా మారింది.