అమ్మాయిని వేధించాడని...


భోపాల్‌: మధ్యప్రదేశ్‌  శివపుర్‌ జిల్లాలో ఓ యువకుడు యువతిని వేధించాడనే కారణంతో ఆమె కుటుంబ సభ్యుల అతన్ని చితకబాధి మలం తినిపించారు. అనంతరం ఆ యువకుడు, యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఒకరి పై ఒకరు కేసు పెట్టుకున్నారు.

 

యువకుడు కలు ధాకద్‌ చెప్పిన కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన యువతి జులై 16న సమీప పొలాలకు పిలిచిందని, అతను అక్కడి వెళ్లిన సమయంలో ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసి మలం తినిపించారని కలు మీడియాకు తెలిపాడు. అలాంటిది ఏమిలేదని, ఒకే గ్రామానికి చెందిన వారని, వారి మధ్య సమస్యను పరిష్కరించి కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top