బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురు మృతి


లక్నో : ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్నోలోని మహన్లాల్ గంజ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. కాగా బాణాసంచా ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేనట్లు సమాచారం. అయినా అక్రమంగా మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top