నేటి నాయకుల తరంలో 'లీ' అగ్రజుడు: మోదీ

నేటి నాయకుల తరంలో 'లీ' అగ్రజుడు: మోదీ - Sakshi


సింగపూర్: సింగపూర్ వ్యవస్థాపక ప్రధాని లీ క్వాన్ యూ(91) నేటి తరం నాయకుల్లో అగ్రజుడని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం వేకువ సమయంలో లీ అంత్యక్రియల కోసం సింగపూర్ వెళ్లిన మోదీ మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ అనుభవమున్న లీ.. ప్రపంచ మేధావి అని కొనియాడారు. ఆర్థిక పురోభివృద్ధికి ఆయన మంచి మార్గదర్శకులు అని చెప్పారు.



సింగపూర్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఆయన పొరుగు దేశాలతో శాంతియుత పరిస్థితులను కొనసాగించారని, స్నేహపూర్వకంగా మెలిగారని అన్నారు. ప్రత్యేకంగా భారత్తో ఆయన మెలిగిన తీరు, భారత అభివృద్ధికి అందించిన సహకారం, ప్రపంచ దేశాల నడుమ ఇచ్చిన ప్రాధాన్యత వర్ణించరానిదని అన్నారు. ఆయన మరణం తీరని లోటని చెప్పారు. లీ గత సోమవారం దీర్ఘకాల వ్యాధితో చనిపోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top