బీజేపీ నేతలపై కేవీపీ ప్రివిలేజ్ మోషన్

బీజేపీ నేతలపై కేవీపీ సభా హక్కుల నోటీసు - Sakshi


న్యూఢిల్లీ : బీజేపీ నేతలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. తన హక్కులకు బీజేపీ నేతలు భంగం కలిగించారంటూ ఆయన మంగళవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్కు అందచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ బిల్లును చర్చకు రాకుండా శుక్రవారం సభ వాయిదా వేయటం తన హక్కులను అడ్డుకోవటమే అని కేవీపీ తన నోటీసులో పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా రాజ్యసభలో తన హక్కులను కాలరాయడమే అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని కేవీపీ ఇవాళ సభలో ప్రస్తావించారు.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top