నితీశ్ లేని కూటమికి మద్దతిస్తా: మాంఝీ
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్రాం మాంఝీ గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ భాగస్వామ్యంలేని కూటమికి అసెంబ్లీ ఎన్నికల అనంతరం మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.
ప్రధానితో మాంఝీ భేటీ రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలకు ఊతమిచ్చింది. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసమే మోదీని కలిసి ఉంటారనే విషయంపై మాత్రం మాంఝీ మౌనం పాటిస్తున్నారు. ఒకవేళ ఎవరితోనైనా ఎన్నికల పొత్తు పెట్టుకోవాల్సి వస్తే తన రాజకీయ గురువు, బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ లేని కూటమిలో భాగస్వామినవుతానని మాంఝీ స్పష్టం చేశారు.