12 రోజుల తరువాత బయటకు వచ్చిన జయలలిత
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 12 రోజుల తరువాత ఇంటి నుంచి బయటకు వచ్చారు. పసుం పొన్ ముత్తు రామలింగం దేవర్ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేవర్ చిత్రపటానికి నివాళులర్పించి, తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21 రోజులపాటు జైలుశిక్ష అనుభవించిన జయలలిత ఈ నెల 18 మధ్యాహ్నం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఆ రోజు సాయంత్రం చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న తరువాత ఆమె బయటకు రాలేదు. ఈరోజే బయటకు వచ్చారు.
**