పుల్వామాలో కాల్పులు.. ఇద్దరు పౌరులు మృతి


పుల్వామా: జమ్ము కశ్మీర్లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయాలపాలయ్యారు. పుల్వామా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులను ఏరివేసే చర్యల్లో భాగంగా కాకపోరా ఏరియాలో సైన్యం, పోలీసులు ఉమ్మడిగా సోదాలు జరుపుతుండగా అనుమానిత ఉగ్రవాదులు ఎదురుపడ్డారు.



దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా వారిలో ఒకరు చనిపోయారు. అయితే, ఈ ఘటన స్థానికులకు బలగాలకు మధ్య ఘర్షణకు దారి తీసింది. ఎక్కువ సంఖ్యలో గుమ్మిగూడి పోలీసులు, సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top