విద్యార్థుల ఆవిష్కరణలకు ఆహ్వానం పలకండి
దేశంలో మరిన్ని ఉపగ్రహాలకు రూపకల్పన చేయాలంటే విద్యార్థుల నుంచి నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం పలకాలని ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ మిల్ స్వామి అన్నాదురై అన్నారు. నిజానికి వారు చేసే ఆవిష్కరణలే కొత్త ఉపగ్రహాల రూపకల్పనకు ఉపయోగపడతాయని, ప్రపంచ వ్యాప్త పోటీని తట్టుకుంటాయని చెప్పారు. దీంతోపాటు వారికి అంతరిక్షానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా సంపూర్ణంగా అందిస్తున్నట్లవుతుందన్నారు. విద్యార్థుల సహాయంతో రూపొందించిన మూడు ఉపగ్రహాలు ఇప్పటికే విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు.