దర్శనమివ్వడానికి మోడీ ఏమైనా దేవుడా?

దర్శనమివ్వడానికి మోడీ ఏమైనా దేవుడా? - Sakshi


అప్పుడప్పుడు వచ్చి దర్శనం ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏమైనా దేవుడా అని లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా లోక్సభలో కాంగ్రెస్ సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు. కనీసం వారానికి ఒక రోజైనా ప్రధాని మోడీ పార్లమెంటుకు ముఖం చూపించాలన్న వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మండిపడటంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.



ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాని సభలోనే ఉన్నారని, 'మీరు కావాలంటే ఆయన దర్శనం చేసుకోండి' అని సుష్మా అనడంతో మండిపడిన ఖర్గే.. మోడీ ఏమైనా దేవుడా అంటూ నిలదీశారు. ప్రధాని ప్రతిరోజూ కాకపోయినా కనీసం వారానికి ఒకసారైనా సభకు వచ్చి ముఖం చూపించాలని, బడ్జెట్ సమావేశాల తర్వాత అసలు ఆయన సభకే రావట్లేదని ఖర్గే బుధవారం నాడు సభలో వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top