‘హీరాఖండ్‌’ ప్రమాదం దుశ్చర్య కాదు


సీఐడీ ప్రాథమిక నిర్ధారణ



సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా కూనేరు వద్ద జనవరి 21 అర్ధరాత్రి జరిగిన హీరాఖండ్‌ రైలు దుర్ఘటన దుశ్చర్య కాదని ప్రాథమికంగా తేలింది. 41 మంది ప్రయాణికులను బలిగొన్న ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య  ఉండవచ్చని అప్పట్లో రైల్వే అధికారులు భావించారు. ఒడిశాలోని రాయ్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని కూనేరుల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉండడంతో ఈ ప్రచారానికి తెరలేపారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీతో విచారణకు ఆదేశించింది.



కేంద్ర హోంశాఖ కూడా దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు ప్రమాద స్థలంలో పేలుడు పదార్థాల ఆనవాళ్లు గాని, నక్సల్స్‌ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు గాని లభించలేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ  నివేదికను కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ అథారిటీ (ఎన్‌ఐఏ)కి అప్పగించినట్టు తెలిసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top