కేంద్ర బడ్జెట్ హైలైట్స్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ లోక్సభలో శనివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ..
మొత్తం బడ్జెట్ - కేటాయింపులు..
-
కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు -
ప్రణాళికా వ్యయం రూ.4,65,000 -
ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు -
రక్షణకు రూ.2,46,727 కోట్లు -
వైద్యానికి రూ. 3,31,500 కోట్లు -
విద్యా రంగానికి రూ.68,960 కోట్లు -
గృహనిర్మాణాలకు రూ.22,407 కోట్లు -
మహిళా శిషు సంక్షేమం రూ.10,500 కోట్లు -
జల వనరులకు రూ.4,173 కోట్లు -
ఏపీలో ఐఐఎం ఏర్పాటు -
సోలార్ ఎలక్ట్రికల్ వాహనాలకు రూ.70 కోట్లు -
నిర్భయ ఫండ్కు వెయ్యి కోట్లు -
ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు -
మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు. -
ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు -
అల్ట్రా మెగా పవర్కు లక్ష కోట్లు. -
ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు -
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు -
వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం. -
మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు. -
నాబార్డుకు 25 వేల కోట్లు -
ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు -
శిషు సంరక్షణకు 300 కోట్లు -
చైల్డ్ డెవలప్మెంట్ కు 1500 కోట్లు -
మౌలిక వసతులకు 70 వేల కోట్లు -
స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి -
చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు -
స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు -
గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు.
కొత్త పథకాలు..
-
ఏడాదికి 330తో ప్రమాద బీమా -
వీసా ఆన్ అరైవల్ స్కీం కింద 150 దేశాలు -
అశోక చక్ర ముద్రతో బంగారు నాణేలు -
4 వేల మెగా వాట్ల సామర్థ్యం గల 5 మెగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు. -
సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్. -
అటల్ పెన్షన్ యోజన కొనసాగుతుంది -
యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటు ఏర్పాటుకు కృషి -
అత్యున్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత. -
80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ -
భారత్ను తయారీ రంగానికి హబ్గా చేస్తాం -
కేంద్రం పన్నుల్లో 62శాతం నిధులను రాష్ట్రాలకు ఇస్తాం -
జన్ధన్ యోజన ద్వారా మధ్య తరగతి పేదలకు బీమా సౌకర్యం -
గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. -
లక్ష రూపాయలు దాటిన ప్రతి లావాదేవీకి పాన్ నెంబర్ తప్పనిసరి -
బ్లాక్ మనీ నిరోధానికి కొత్త చట్టం -
విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే ఏడేళ్ల జైలు శిక్ష -
డిజిటల్ ఇండియాలో భాగంగా ఐదు లక్షల గ్రామాల్లో వైఫై సౌకర్యం -
వెనుకబడిన రాష్ట్రాలతోపాటు ఏపీకి ప్రత్యేక సాయం -
ఉపాధి కల్పనకు నేషనల్ స్కిల్ మిషన్ -
పన్ను ఎగవేత దారులకు జైలు శిక్ష పదేళ్లకు పెంపు -
ఉన్నత విద్యకోసం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం -
డిజిటల్ ఇండియాలో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
హామీలు..
-
12.5 కోట్ల కుటుంబాలకు జనధన్ యోజన -
6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం. -
ఎంపీలందరూ గ్యాస్ సబ్సిడీలను వదులుకోవాలి. -
సబ్సిడీలు హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది. -
ఏడాదికి రూ.12 బీమాతో రూ.2 లక్షల ప్రీమియం. -
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ -
ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి తగ్గిస్తాం. -
ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉద్యోగాలు కలిగి ఉండేలా చేస్తాం -
ఇండియాను తయారీ రంగం ద్వారా వృద్ధిలోకి తెస్తాం -
స్కిల్ ఇండియా.. మేక్ ఇండియాకు మరింత ప్రాధాన్యం -
2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు ఇస్తాం -
స్కాలర్ షిప్ లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే. -
11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించాం. -
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం -
ద్రవ్యోల్భణం 5.1శాతానికి తగ్గింది -
లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మాస్తాం -
పన్నుల్లో రాష్ట్రాలకు 42శాతం ఇస్తున్నాం -
ఆధార్ జన్ధన్ ద్వారా లబ్ధిదారులకు పథకాలు వర్తిస్తున్నాయి -
వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం -
2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం -
త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకుంటాం. -
2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం. -
ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిస్తాం. -
ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్సిస్తాం. -
ఏపీ తెలంగాణ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తాం -
బీహార్, బెంగాల్తోపాటు ఏపీ ఆర్థిక సాయం -
గోల్డ్లోన్ల పథకం స్థానంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ -
హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టోంబ్స్ రక్షణకు నిధులు
పన్నుల విధింపులు..
-
హెల్త్ ఇన్స్యూరెన్స్ లిమిట్ రూ.25వేలకు పెంపు -
సర్వీస్ ట్యాక్స్ 14శాతం పెంపు -
పెరగనున్న సిగరెట్ ధరలు -
ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీ.. 15 వేల నుంచి 25 వేలకు పెంపు -
సీనియర్ సిటిజన్లకు ఇది 10 వేల నుంచి 30వేలకు పెంపు -
పెన్షన్ ఫండ్కు చెల్లింపులపై రాయితీ 1 లక్ష నుంచి 1.5 లక్షలకు పెంపు -
బినామీ ఆస్తులపై కొరడా ఝులిపిస్తాం -
సంపద పన్ను రద్దు -
కోటి రూపాయల ఆదాయం దాటితే 2శాతం అదనపు పన్ను -
వెయ్యి రూపాయలు దాటిన పాదరక్షలపై ఆరు శాతం సుంకం -
బొగ్గు మీద క్లీన్ ఎనర్జీ సెస్ 100 నుంచి 200 పెంపు -
సంపద పన్నుపై 2శాతం అదనపు సర్ చార్జీలు -
2015-16 మధ్య ఆర్ధిక అభివృద్ధి 8 నుంచి 8.5శాతం పెరిగే అవకాశం -
జీడీపీ వృద్ది రేటు 7.8 శాతం ఉంది.. ఇది మరింత పెరగనుంది
పన్నుల తగ్గింపులు.. మినహాయింపులు..
-
స్వచ్ఛ భారత్కు అందించే నిధులకు వందశాతం పన్ను మినహాయింపు -
తగ్గనున్న బూట్ల ధరలు.. లెదర్ గూడ్స్పై ఆరుశాతం పన్ను తగ్గింపు -
ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ కింద 1600వరకు మినహాయింపు -
80 ఏళ్లు దాటిన వారికి 30 వేల వరకు వైద్య బిల్లులు పన్ను నుంచి మినహాయింపు -
వికలాంగులకు అదనంగా 20వేల పన్ను రాయితీ -
సాంకేతిక సేవలపై పన్ను 15శాతం తగ్గింపు -
కార్పోరేట్ పన్ను 30 నుంచి 25శాతానికి తగ్గింపు. ఈ తగ్గింపు నాలుగేళ్ల పాటు వర్తిస్తుంది. -
దవ్యోల్బణం 6శాతానికి పెరగకుండా చర్యలు తీసుకుంటాం -
ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం.
ప్రసంగంలోని కీలకాంశాలు..
-
రూపాయి మారకం విలువ బలపడుతోంది. -
ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు -
ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం -
భారత్ వృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది -
340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు -
పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం -
ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. -
అవినీతిని అంతం చేసేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. -
భారత ఆర్ధిక వ్యవస్థకు బడ్జెట్ దశా నిర్దేశం చేస్తుంది -
ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెడతాం -
జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది -
కరెంట్ అకౌంట్ లోటు మూడుశాతం -
ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లు -
మనీలాండరింగ్ చట్టాల్లో మార్పులు -
ఆదాయ పన్ను యధాతథం.