‘సైఫ్ది శత్రువు ఆస్తి’ ఉత్తర్వుపై స్టే
జబల్పూర్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్కు, ఆయన కుటుంబ సభ్యులకు వారసత్వంగా వచ్చిన భోపాల్ నవాబ్ ఆస్తిని శత్రువు ఆస్తిగా ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యప్రదేశ్ హైకోర్టు గురువారం స్టే విధించింది. కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఇన్ ఇండియా(సెపీ) ముంబై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఉత్వర్వు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ వేసిన పిటిషన్పై నాలుగు వారాల్లోగా స్పందించాలని సెపీ, కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సైఫ్ పూర్వీకుడైన భోపాల్ నవాబు హమీదుల్లా పెద్ద కుమార్తె 1950లో పాకిస్తాన్కు వలస వెళ్లడంతో ఆయన ఆస్తిని శత్రువు ఆస్తిగా ప్రకటించారు.