హిమాచల్ప్రదేశ్లో హై అలర్ట్
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. హిమాచల్ప్రదేశ్ హై అలర్ట్ ప్రకటించింది.
సిమ్లా, కులు, సిర్మార్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పలంపూర్, కాంగ్రా జిల్లాలో అత్యధికంగా 61 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వాగులు, నదులు ప్రవహిస్తున్నాయి. అయితే ప్రమాదకర స్థాయిలోపే ప్రవహిస్తున్నాయని, ప్రధాన హైవేలపై రాకపోకలకు అంతరాయం లేదని అధికారులు తెలిపారు.