బీజేపీ చీఫ్గా రాజ్నాథ్ ఉన్నట్టయితే పొత్తు చెడేది కాదు
న్యూయార్క్: బీజేపీ అధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్ కొనసాగి ఉన్నట్టయితే ఎన్డీయే కూటమి నుంచి తాము బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగాల్సిందిగా రాజ్నాథ్కు గతంలో చెప్పానని పేర్కొన్నారు.
పార్టీ పదవిలో రాజ్నాథ్ ఉన్నట్టయితే బీజేపీ, శివసేనల మధ్య పొత్తు కొనసాగేలా ఆయన కృషిచేసుండేవారని ఉద్దవ్ చెప్పారు. సీట్ల సర్దుబాటు గురించి బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, రాజ్నాథ్, సుష్మా స్వరాజ్లతో చర్చించినట్టు తెలిపారు. పొత్తు చెడిపోవడానికి బీజేపీ చీఫ్ అమిత్ షానే కారణమన్నట్టుగా పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు.