హస్తినలో మకాం వేసిన గవర్నర్
న్యూఢిల్లీ : గవర్నర్ నరసింహన్ ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఉదయం హస్తిన చేరుకున్న ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్లతో పాటు పలువురు మంత్రులను కలుసుకుంటారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చల వివరాలను గవర్నర్ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరిస్తారు. రెండు రోజులు పాటు ఢిల్లీలో ఉండనున్న నరసింహన్ హైదరాబాద్లో శాంతిభద్రతలు, గవర్నర్ అధికారాలపై చర్చించనున్నారు.