ఎన్బీటీ చైర్మన్ను తొలగించిన సర్కారు
ఢిల్లీ/కొచ్చి: మరో 7 నెలల్లో రిటైర్ కానున్న నేషనల్ బుక్ ట్రస్ట్(ఎన్బీటీ) చైర్మన్, మలయాళీ రచయిత సేతుమాధవన్ కేంద్రం ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’ మాజీ ఎడిటర్ బల్దేవ్ శర్మను నియమించింది. ‘సెప్టెంబర్ 12న నా పదవీకాలం ముగుస్తుంది. కానీ మూడ్రోజుల క్రితం వాళ్లు(ప్రభుత్వం) నన్ను పిలిచారు. పదవి నుంచి తప్పుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వారికి కావాల్సినవారిని పదవిలో కూర్చోబెట్టాలని భావిస్తున్నట్టు నాకు అర్థమైంది. వెంటనే రాజీనామా చేశా. సోమవారం రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది’ అని మాధవన్ తెలిపారు. ఆయనను 2012లో యూపీఏ ప్రభుత్వం ఎన్బీటీ చైర్మన్గా నియమించింది.