696,321 ఓట్ల తేడాతో ప్రీతమ్ ముండే విజయం

696,321 ఓట్ల తేడాతో ప్రీతమ్ ముండే విజయం

ముంబై: బీద్ లోకసభ నియోజకవర్గంలో దివంగత బీజేపీ సీనియర్ నేత గోపినాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. గోపినాధ్ ముండే ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఖాళీతో బీద్ లోకసభకు ఉప ఎన్నిక జరిగింది. 

 

ఈ  ఉప ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఎస్. పాటిల్ పై 696,321 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రీతమ్ ముండేకు 922,416 ఓట్లు పోలయ్యాయి. శివసేన, ఎన్సీపీలు ఈ స్థానంలో అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top