విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం

విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం


వారణాసి: ఆరుగురు వ్యక్తులు ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరప్రదేశ్లోని చాందౌలి జిల్లా ఇల్లియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9న ఈ ఘటన జరిగింది. ఎస్పి మునిరాజ్ కథనం ప్రకారం ప్లస్ టు చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని స్కూల్ కు వెళుతుండగా ఆరుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు.



ఆ తరువాత నిందితులు ఆ విద్యార్థినిని అలహాబాద్ తీసుకువెళ్లారు. అక్కడ ఆ బాలికను నిర్బంధంలో ఉంచి ఆరుగురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ విధంగా వారు ఆరు రోజులపాటు అలా చేశారు. ఆ తరువాత ఆ బాలికను వారు వారణాసి తీసుకువచ్చి రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టినట్లు ఎస్పి చెప్పారు.



నిందితులలో ఒకడు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లారు. బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top