బంకుల ఆందోళన విరమణ

బంకుల ఆందోళన విరమణ


ముంబై: నేటి నుంచి ప్రతి ఆదివారం సెలవు తీసుకోవడంతో పాటు రోజూ మధ్యాహ్నం వరకే పనివేళలు ఉండాలని ఆందోళన చేస్తున్న పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు వెనక్కితగ్గాయి.


ఈ నెల 17న ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో సమీక్షా సమావేశం జరగనున్న నేపథ్యంలో తమ ఆందోళనను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌(ఎఫ్‌ఎంపీడీఏ) అధ్యక్షుడు ఉదయ్‌ లోధ్‌ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఒక్క మహారాష్ట్రలోనే 4,500 పెట్రోల్‌ బంకులు ప్రభావితమవుతాయని ఆయన వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా రాష్ట్రాల్లో ఖర్చుల తగ్గింపుపై భారత పెట్రోలియం డీలర్ల సంఘంతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నట్లు ఎఫ్‌ఎంపీడీఏ తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top