బంకుల ఆందోళన విరమణ
ముంబై: నేటి నుంచి ప్రతి ఆదివారం సెలవు తీసుకోవడంతో పాటు రోజూ మధ్యాహ్నం వరకే పనివేళలు ఉండాలని ఆందోళన చేస్తున్న పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వెనక్కితగ్గాయి.
ఈ నెల 17న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమీక్షా సమావేశం జరగనున్న నేపథ్యంలో తమ ఆందోళనను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ మహారాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్ఎంపీడీఏ) అధ్యక్షుడు ఉదయ్ లోధ్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఒక్క మహారాష్ట్రలోనే 4,500 పెట్రోల్ బంకులు ప్రభావితమవుతాయని ఆయన వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా రాష్ట్రాల్లో ఖర్చుల తగ్గింపుపై భారత పెట్రోలియం డీలర్ల సంఘంతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నట్లు ఎఫ్ఎంపీడీఏ తెలిపింది.