కొండచరియలు పడి నలుగురి మృతి


డెహ్రాడూన్: కొండచరియలు విరిగిపడి సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్వో)కు చెందిన నలుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఉత్తరాధిన భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అవన్నీ కొండ ప్రాంతాలైందువల్ల ఇప్పటికే పలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో రహదారులను పర్యవేక్షించే వీరు మంగళవారం జోషిమఠ్-మలారీ రహదారిని సరిచేస్తుండగా ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగి మీదపడ్డాయి. దీంతో వారు ప్రాణాలు కోల్పోయారు.  మరో ఇద్దరు గాయాల పాలయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top