కాంగ్రెస్కు గమాంగ్ గుడ్బై
పార్టీ తనను తీవ్రంగా అవమానించిందని ఆరోపణ
భువనేశ్వర్: ఒడిశా మాజీ సీఎం, తొమ్మిది సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. 43 ఏళ్లుగా సేవలందిస్తున్నా పార్టీ తనను తీవ్ర అవమానాలకు గురిచేయడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శనివారమిక్కడ తెలిపారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ సోనియాకు పంపానన్నారు. 1999లో వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో కూలినప్పట్నుంచి తనను అవమానిస్తున్నారన్నారు. వాజ్పేయి ప్రభుత్వం కూలడానికి తాను కారణం కాదని, అప్పటి నేషనల్ కాన్ఫరెన్స్ నేత సైఫుద్దీన్ సోజ్ కారణమని, ఆయన తన పార్టీ విప్ను ధిక్కరించి విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు.