మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన మాజీ లెక్చరర్

మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన మాజీ లెక్చరర్ - Sakshi


అహ్మదాబాద్:  తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ... అత్యాచారం చేశాడని మాజీ ప్రియుడు, పీహెచ్డీ విద్యార్థిపై ఓ కాంట్రాక్ట్ మహిళా లెక్చరర్ శాటిలైట్ ఏరియా పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక ఐఐఎంలో బాధితురాలు అసిస్టెంట్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తుంది. పీహెచ్డీ విద్యార్థిగా సందీప్ కృష్ణన్ అదే ఐఐఎంలో చేరాడు. ఆ క్రమంలో లెక్చరర్తో సందీప్ మధ్య చనువు పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారింది.


దీంతో నిన్ను పెళ్లి చేసుకుంటానని లెక్చరర్ను నమ్మించాడు. దీంతో ఇద్దరు మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కాగా సందీప్ చదువు ముగించుకుని ఉద్యోగం కోసం ఢిల్లీ చేరుకున్నాడు. మహిళా లెక్చరర్ తన కాంట్రాక్ట్ ముగియడంతో ఆమె బెంగళూరు చేరుకుంది. అయితే అక్కడ సందీప్కు మరో మహిళతో ఈ ఏడాది మేలో వివాహం జరిగినట్లు ఆమెకు తెలిసింది. దీంతో తాను మోసపోయానని భావించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు సందీప్ కృష్ణన్పై కేసు నమోదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top