వరదలకు మరో 74 మంది మృతి
పట్నా/గువాహటి: బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వరదలకు తాజాగా మరో 74 మంది చనిపోయినట్లు అధికారులు గురువారం చెప్పారు. దీంతో బిహార్లో ఈ వర్షాకాలంలో మరణించిన వారి సంఖ్య 119కి చేరింది.
అటు అస్సాంలో ఇప్పటికే వంద మందికి పైగా మరణించడం తెలిసిందే. నేపాల్, బిహార్లలో వర్షాలు మరో వారం కొనసాగుతాయని వాతావరణ విభాగం చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్లో వరద కారణాలతో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది.