ఛత్తీస్గఢ్లో రెండు ఎన్కౌంటర్లు
నలుగురు మావోయిస్టుల మృతి
చింతూరు/ దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ , ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా ఎలిమిడి పోలీస్స్టేషన్ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ కు చెందిన గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్కు చెందిన డిస్ట్రిక్ట్ ఫోర్స్ జవాన్లు(డీఆర్జీ) కూంబింగ్కు వెళ్లారు. లంకపల్లి సమీపంలో తారసపడిన మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
సుక్మా జిల్లా కిష్టారం పోలీ స్స్టేషన్ పరిధిలోని తుమ్మవాగు గ్రా మం వద్ద మావోయిస్టు కమాండర్లు నగేష్, సుధాకర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ జవాన్లు కూంబింగ్కు వెళ్లారు. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో రామా అనే మావోయిస్టు మృతిచెందాడు. ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు. సుక్మా జిల్లా గడ్గనమెట్ట వద్ద మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలడంతో ఓ సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలయ్యాయి.