ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం


న్యూఢిల్లీ : ఢిల్లీలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.  బహుళ అంతస్తుల కార్యాలయ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పోలీసులు అప్రమత్తమైయారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.


 


సమాచారం అందుకున్న వెంటనే ఎనిమిది ఫైర్ ఇంజన్‌లు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. నాలుగో అంతస్తులో బ్యాటరీ పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.   కాగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం జరగటం ఇది మూడోసారి. ఈ ప్రమాదంపై  ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top