మాలవీయకు భారతరత్న
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు దివంగత మదన్ మోహన్ మాలవీయకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును మాలవీయ కుటుంబ సభ్యులకు అందజేశారు.
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయితో పాటు మాలవీయకు సంయుక్తంగా భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. వృద్దాప్య సమస్యలతో కదలలేని పరిస్థితిలో ఉన్న వాజ్పేయికి.. ఇటీవల రాష్ట్రపతి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి అందజేశారు.
సంబంధిత వార్తలు