పెంపుడు కుక్కకు దశదిన కర్మ


ఇండోర్: కుక్క (ఆడజాతి)ను ఎంతో ప్రేమతో పెంచుకుని కూతురిలా చూసుకున్నారు. ఈ పెంపుడు కుక్క చనిపోతే ఇంట్లో వ్యక్తి చనిపోయినట్టు బాధపడ్డారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి, దశదిన కర్మ చేయించారు. సన్నిహితులను పిలిచి 500 మందికి భోజనాలు పెట్టారు. అంతేగాక ఆ ఇంటి యజమాని కుమారుడు సాంప్రదాయం ప్రకారం క్షవరం చేయించుకుని నివాళులు అర్పించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది.  



పప్పు చౌహాన్కు జర్మన్ షెపర్డ్ పింకీని పెంచుకున్నారు. చౌహాన్ దంపతులకు ఇద్దరు కుమారులుండగా, ఈ కుక్కను కూతురిలా చూసుకున్నారు. కాగా పక్షవాతంతో ఆ కుక్క ఇటీవల మరణించడంతో చౌహాన్ కుటుంబం ఎంతో బాధపడింది. హిందూ సాంప్రదాయం ప్రకారం కుక్కకు తుది సంస్కారాలు నిర్వహించి నివాళులు అర్పించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top