బీహార్ మాజీ సీఎం కన్నుమూత
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత రాం సుందర్ దాస్(95) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుందర్ దాస్ ఇటీవల పాట్నాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ రెండు రోజుల కిందటే ఇంటికి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో చనిపోయారు. ఆయన 1979లో కేంద్రంలో జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుందర్ దాస్ మృతిపట్ల ఆయన ముఖ్యమంత్రి నితీశ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి పుష్పాలతో నివాళులర్పించారు.
మరిన్ని వార్తలు