ఆ స్కూల్లో అంతా సెలవుల్లోనే.. మంత్రి షాక్
ఎప్పుడూ రాజకీయ వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండే మహారాష్ట్ర మంత్రి ఒకరు ఎవరికీ చెప్పకుండా ఓ అంధుల పాఠశాల తనిఖీకి వెళ్లి షాక్కు లోనయ్యారు. ఎందుకంటే ఆయన వచ్చే వరకు ఒక్క ఉపాధ్యాయుడు కూడా అందులో లేకపోగా.. విద్యార్థులు కూడా లేరు. అందరూ సెలవుల్లోనే ఉండగా ఒక్క ప్యూన్ మాత్రం సదరు మంత్రికి కనిపించారు. అందులో పనిచేసేవాళ్లు మంత్రి దగ్గరకు వచ్చి అందరూ సెలవుల్లో ఉన్నారండి అని తాపీగా సమాధానాలు చెప్పి రోజువారి పనుల్లో నిమగ్నమయ్యారట.
మహారాష్ట్రలోని సామాజిక న్యాయశాఖకు చెందిన మంత్రి రాజ్కుమార్ నాగ్పూర్లోని ఆశ్రయ్ రెసిడెన్సియల్ అంధుల పాఠశాల తనిఖీకి వెళ్లగా ఈ అనుభవం ఎదురైంది. ఆయన పాఠశాల రికార్డును చూడగా మొత్తం 80మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలుండంతోపాటు వారికి సహాయపడేందుకు సిబ్బంది, ఉపాధ్యాయులతోకలిపి 25మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎవరూ లేకపోయే సరికి ఆయన ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని రాష్ట్రంలోని మొత్తం 120 అంధుల పాఠశాలలను తనిఖీలు చేయాల్సిందిగా అధికారులను పురమాయించారు.