బ్రాండ్‌ అంబాసిడర్‌ను చేయండి: కేజ్రీవాల్‌

బ్రాండ్‌ అంబాసిడర్‌ను చేయండి: కేజ్రీవాల్‌ - Sakshi


న్యూఢిల్లీ: ఇతర పార్టీల నాయకులిచ్చే డబ్బులు తీసుకొని ఓట్లు మాత్రం తమ పార్టీకి వేయాలంటూ గోవా ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్నికల సంఘం తీవ్రంగా మందలించినా.. ఆయన మాత్రం తన వ్యాఖ్యలను మళ్లీమళ్లీ వాడేందుకు అనుమతించాలంటూ ఈసీకి లేఖ రాశారు. అవినీతి కట్టడి కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేశానని లేఖలో పేర్కొన్నారు.


ఎన్నికల్లో అవినీతిపై పోరుకు తాను చేస్తున్న కృషికి గాను తనను ఈసీ ‘బ్రాండ్‌ అంబాసిడర్‌’గా నియమించాలంటూ వ్యంగ్యాస్రా్తలు సంధించారు. ఈసీ తన వ్యాఖ్యలను అడ్డుకోవడం వల్ల అవినీతిని ఆపలేదని, అదీగాక దీన్ని మరింత ప్రోత్సహించినట్లవుతుందని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top