స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు!

స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు! - Sakshi


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' వీడియో యూట్యూబ్లో పది లక్షల హిట్లు దాటేసింది. ఆర్- విజన్ ఇండియా ఎండీ రవీంద్ర సింగ్ నిర్మించి, పాడిన ఈ వీడియోకు 'ఏక్ భారత్ర శ్రేష్ఠ భారత్' అనే టైటిల్ పెట్టారు. దేశ ప్రజల కోసం దేశం అంతా పరిశుభ్రంగా ఉండాలన్న సందేశాన్ని ఈ వీడియో ఇస్తుంది. ప్రధానమంత్రి ఆలోచనలను, ఆయన దూరదృష్టిని ఈ వీడియో ద్వారా ప్రజలకు అందజేయాలని తాము ప్రయత్నించినట్లు రవీంద్ర సింగ్ చెప్పారు.



రాణీ మాలిక్ రాసిన ఈ పాటకు.. మానెక్, సత్య, అఫ్సర్ సంగీతం అందించారు. ఈ వీడియోకు రాజీవ్ ఖండేల్వాల్ దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, హీరోలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వీడియోలో కనిపిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top