మంచి మనుషులను తయారు చేయాలి!
విద్యాసంస్థలకు ప్రణబ్ సూచన
పురూలియా: మారుమూల ప్రాంతాల్లో స్థానికులు ఏర్పాటుచేసే విద్యాసంస్థలు.. ప్రెసిడెన్సీ కాలేజీ, ద హిందూ స్కూల్ వంటి ప్రముఖ విద్యాలయాల స్థాయికి ఎదిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లోని ‘ఝాల్దా సత్యభామ విద్యాపీఠ్’ వందేళ్ల వ్యవస్థాపక వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్ని ప్రసంగించారు. విద్యాసంస్థలు తెలివైన విద్యార్థులతోపాటు.. సమాజ రూపురేఖలు మార్చే మానవత్వం ఉన్న మంచి మనుషులను తయారుచేయాలన్నారు.
సంబంధిత వార్తలు