భూకంప ప్రభావం: బీహార్లో 58 మంది మృతి
పాట్నా: భూంకంపం వల్ల బీహార్లో మరణించిన వారి సంఖ్య 58కు పెరిగింది. శనివారం సంభవించిన భూప్రకంపనల ప్రభావం భారత్లో బీహార్పై ఎక్కువగా ఉంది. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కూడా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసి రోడ్లపైకి వచ్చారు. భూకంప ప్రభావం బీహార్తో పాటు ఉత్తరాది, ఈశాన్య భారత రాష్ట్రాలను వణికించింది.