అక్రమ డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్..
శ్రీనగర్ః అక్రమంగా మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నఓ వ్యక్తిని కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పట్టుబడ్డ అతడి వద్దనుంచి 27 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవేకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవంతిపురా ఆస్థాన్ మొహల్లా నుంచి షబీర్ అహ్మద్ షా అనేవ్య్తక్తి అక్రమంగా మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నాడన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. కాపుకాసి, పంజ్గామ్ గ్రామానికి చెందిన అతడ్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో నాకాబందీ నిర్వహిస్తున్న తమకు మత్తు పదార్థాల అక్రమ వ్యాపారికి సంబంధించిన సమాచారం అందిందని, దీంతో అతడిని అడ్డగించి అరెస్టు చేయడంతోపాటు అతడివద్దనుంచీ 27 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.