ఇరాక్ వెళ్లితే ఇంక అంతే...!


పానాజీ: ఉద్యోగం కోసం ఇరాక్ కు వెళ్లవద్దని యువకులకు గోవా రాష్ట్రానికి సంబంధించిన ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. బాగ్దాద్ లోని భారతీయ రాయబార కార్యాలయంలో విచారించిన తర్వాతే ఈ హెచ్చరిక చేస్తున్నామని ఎన్నారై విభాగా డైరెక్టర్ యూడీ కామత్ తెలిపారు. 

 

ఇరాక్ లో అంతర్గత పరిస్థితులు దారుణంగా ఉన్న కారణంగా ఉద్యోగం కోసం యువకులు వెళ్లకూడదని.. ఆ దేశానికి ప్రయాణించకూడదని ఆంక్షల్ని విధించారు. ఇరాక్ సంక్షోభంలో నలభై ఆరు మంది భారతీయ నర్సులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top