ముగ్గురు పోలీస్ అధికారులకు వారెంట్లు!
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఢిల్లీ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. సీపీఐ (మావోయిస్ట్) నేత కోబాడ్ గాంధీ కేసులో వారు కోర్టుకు హాజరు కానందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 65 ఏళ్ల వయసున్న కోబాడ్ గాంధీపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆయనపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
కోబాడ్ గాంధీ కేసుకు సంబంధించి డిప్యూటీ ఎస్పీలు రాజేష్ శ్రీవాత్సవ, శామీర్ సౌరబ్, ఎస్ఐ రాజీవ్ దివేదిలు కోర్టుకు ఎటువంటి సాక్ష్యాధారాలు సమర్పించనందున కోర్టు వారెంట్లు జారీ చేసింది.
**