18 శాతం జీఎస్టీకి కాంగ్రెస్ పట్టు!
న్యూఢిల్లీ: జీఎస్టీ 18 శాతానికి మించకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. ఈ మేరకు పార్టీ సీఎంలకు, ఆర్థిక మంత్రులకు లేఖలు రాసింది. అక్టోబర్ 17 నుంచి మూడు రోజుల పాటు జరిగే సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించాలని వారు భావిస్తున్నారు. జీఎస్టీ 18 శాతానికి మించితే సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. వచ్చే సమావేశాల్లో కేంద్రానికి ఈ విషయాన్ని నివేదించాలని కాంగ్రెస్ సీఎంలు, ఆర్థిక మంత్రులు నిర్ణయించారు.