రాహుల్ 65%.. సచిన్ టెండూల్కర్ 5%

రాహుల్ 65%..  సచిన్ టెండూల్కర్ 5% - Sakshi


న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్కు గైర్హాజర్పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్గాలు సోమవారం వివరణ ఇచ్చాయి. పార్లమెంటులో రాహుల్కు ఇప్పటివరకు 65% హాజరు ఉందని తెలిపాయి. రాహుల్ గాంధీ హాజరు కంటే 120మంది ఎంపీల హాజరు ఇంకా ఘోరంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. లోకసభకు 5% కంటే తక్కువ దీపక్ అధికారి, శిబు సోరెన్, సన్వర్లాల్ హాజరైనట్టు తెలిపాయి. అలాగే రాజ్యసభకు 5% కంటే తక్కువగా సచిన్ టెండూల్కర్, రేఖ, రామస్వామిలు హాజరైనట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.



కాగా, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవు తీసుకోవడంపై తీవ్ర విమర్శలు రేకిత్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ రెండు వారాలు సెలవు పెట్టారని ఆ పార్టీ వెల్లడించిన సంగతి విధితమే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top