జగన్ చేసిన దీక్షకు మా మద్దతు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన నిరవధిక నిరాహార దీక్షకు తమ మద్దతు ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చేసే ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్తో తమకు బేదాభిప్రాయాలున్నా...ప్రత్యేక హోదాపై కలిసి పని చేస్తామని దిగ్విజయ్ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాల్సిన చంద్రబాబు నాయుడు పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.