మీడియాతో సత్సంబంధాలు కోరుకుంటున్నా

మీడియాతో సత్సంబంధాలు కోరుకుంటున్నా - Sakshi


న్యూఢిల్లీ : స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి మీడియా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఆయన శనివారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో  పత్రికా సంపాదకులు, జర్నలిస్టులతో ఫేస్ టూ ఫేస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ స్వచ్ఛ్ భారత్పై మీడియాలో మంచి కథనాలు వచ్చాయని ప్రశంసించారు.



తాను మీడియాతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.  మీడియాతో తనకు చాలా సంవత్సరాలుగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అయితే మీడియా రాసిన వార్తలు విశ్వసనీయంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top