తరగతి గదిలో విద్యార్థి హత్య


ఇరిధునగర్: తమిళనాడు రాష్ట్రంలో ఓ విద్యార్థి హత్య గావించ బడ్డ ఘటన కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం విరుధ్ నగర్ జిల్లాలోని పందల్ కూడిలో ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తరగతి గదిలోనే హతమార్చారు.  స్కూల్ ఓపెన్ చేసే సమయంలో అక్కడి చేరుకున్న కొందరు వ్యక్తులు అక్కడ వీరంగం సృష్టించారు. అనంతరం ఓ విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. దీంతో విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ విద్యార్థిని తరగతిలో హతమార్చడంపై కుటుంబ సభ్యులు, విద్యార్థులు  ఆందోళనకు దిగారు.



ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాసేపట్లో తరగతులు ఆరంభం కావాల్సి ఉండగా ఆ విద్యార్థిని వారు హత్య చేశారని పోలీసులు తెలిపారు. విద్యార్థి కుటుంబానికి ఎవరితోనైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top