'పోలవరం, రాజధాని నిర్మాణానికి ప్రతి ఏడాది నిధులు ఇస్తాం'

'పోలవరం, రాజధాని నిర్మాణానికి ప్రతి ఏడాది నిధులు ఇస్తాం' - Sakshi




ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి ఏడాది నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఏపీకి ఆర్థికలోటు భర్తీకి రూ.2,300 కోట్లు ఇచ్చామన్నారు.


 


దీంతో పాటు రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. మరిన్ని నిధులు ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పోలవరం, రాజధాని నిర్మాణాలకు ప్రతీ ఏడాది నిధులు కేటాయిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం కేంద్రం పరిశీలనలో ఉందని అరుణ్ జైట్లీ తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top