కేంద్రానివి కక్ష సాధింపు రాజకీయాలు: సోనియా
రాయబరేలీ: బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్న ప్రాంతాలకు అభివృద్ధి నిధుల్లో కోత వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గురువారం ఆమె ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గం రాయబరేలీలో పర్యటించారు.
అక్కడి అధికారులు, పార్టీ నేతలతో సోనియా సమావేశమై.. వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. కేంద్రం తన నియోజకవర్గం ఉన్న జిల్లాకు ‘ప్రధానమంత్రి గ్రామీణసడక్ యోజన’ నిధులను కుదించారని ఆమె పేర్కొన్నారని ఆ సమావేశంలో పాల్గొన్న యూపీ మంత్రి ఎంకే పాండే వెల్లడించారు.