కారులో మంటలు.. ముగ్గురి సజీవ దహనం
పుణే : వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగటంతో అందులో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. జిల్లాలోని ఆనంద్ గ్రామ శివారులో ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.
కొంత సమయానికే మంటలు ఎక్కువ కావడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అందులో చిక్కుకొని మంటలకు సజీవ దహమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుల వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.